Author: parivarthanaawaaz

  అయ్యప్ప స్వాములకు విరాళం ఇచ్చిన సర్పంచ్ తారా చంద్ నాయక్. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 09, టేకులపల్లి కొత్త తండా జీ గ్రామ పంచాయతీ సర్పంచ్మాలోత్ తారాచంద్ నాయక్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్యా తండా గ్రామంలో అయ్యప్ప స్వామీ దీక్షల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాముల సేవలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ. 9,500/- నగదు విరాళంగా అందజేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్యతండా గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామీ దీక్ష ఇరుముడి కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని స్వాములకు తన సహకారాన్ని అందజేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నేను ఎల్లప్పుడూ సహకరిస్తూ గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.

Read More

        మానవత్వం చాటిన పోలీస్ కానిస్టేబుల్ సంజీవ్ రావు        జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్   కామారెడ్డి పరివర్తన అవాజ్  కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత అనే మహిళా కు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నీ సంప్రదించడంతో ఒక్క ఫోన్ చేయగానే స్పందించిన కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముకుందు గారి సంజీవరావు గారి సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరం ఉంది అనీ మెసేజ్ గాని ఫోన్ గాని రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు రక్తదానంకు ముందుండాలని కోరారు మరియు రక్తదాత కానిస్టేబుల్ సంజీవరావు…

Read More

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం – రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి      మూడో రోజు క్రీడలను తిలకించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి {కొత్తగూడెం పరివర్తన ఆవాస్ }  కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మంత్రికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం…

Read More

                       ఆలయ నిర్మాణం.. అభినందనీయం                            తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్ పరివర్తన ఆవాజ్ జనవరి7 మహబూబాబాద్ ప్రతినిధి పగడాల రామారావు.నర్సింహులపేట. .ఆలయ నిర్మాణం అభినందనీయమని నర్సింహులపేట తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ సురేష్ అన్నారు.నర్సింహులపేట గ్రామ శివారులో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు చలిమల్ల యాదగిరి ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా కాంక్రీటు పనులను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్ మాట్లాడుతూ..గౌడ సంఘం అధ్యక్షునిగా ఉంటూ తన సొంత ఖర్చులతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,ఉప…

Read More

          మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల                                  హడావిడి ప్రారంభం, రంగారెడ్డి, జనవరి 7, (పరివర్తన ఆవాజ్ ) మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలలో ఎన్నికల కొలాహలం మొదలైంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో కేవలం మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఇటీవల ఏర్పడ్డాయి.గతంలో జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ లు, 9 మున్సిపాలిటీలో ఉండేవి. ఇవి రింగురోడ్డు లోపల, రింగ్ రోడ్డు ని ఆనుకొని ఉండడంతో ప్రభుత్వం ఇటీవల జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. అంతకుముందు జిల్లాలోని గ్రామపంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేసింది. రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామాలను కలిపి ఎల్లంపేట,…

Read More

జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌లోకి. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు తిరుమలలో ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత,{పరివర్తన ఆవాజ్}  భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు.ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్…

Read More

హవేళి ఘణాపూర్ మండలకేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.                  పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. (మెదక్ పరివర్తన ఆవాజ్)  మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేకు కట్ చేసి, మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మిఠాయి పొట్లాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండలకేంద్రమైన హవేళి ఘణాపూర్ గ్రామసర్పంచ్ మేకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు సభ్యులు, మండల నాయకులు సతీష్ రావు,…

Read More

టేకులపల్లి గ్రామపంచాయతీలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం. టేకులపల్లి, పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 03 :పౌర్ణమిని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మహిళలు ఎంతో భక్తి భావంతో ఉత్సాహంతో పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి గణేష్ మహారాజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో గుడిపూడి సబిత, తిరుచి శ్రీదేవి, ఆమేడ రమ, కేశ పద్మజ, ఉప సర్పంచ్ అనంతుల వసంత, అనంతుల పరమేశ్వరమ్మ, నెల్లూరి ధనలక్ష్మి, నెల్లూరు రాణి, గుండ చంద్రకళ బండ్ల, రజిని, గుగులోతు రమాదేవి, నెల్లూరి ఉజ్జేటి, సరోజ నెల్లూరి కౌసల్య కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Read More

హలో కామ్రేడ్ చలో ఖమ్మం. సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభ జయప్రదం చేయండి. జిల్లా సిపిఐ నాయకులు గూగులోత్ రామ్ చందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 03: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18న 5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ప్రజా సంఘాలకు మహిళలకు విద్యార్థి యువజన రైతులు వ్యవసాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ…

Read More

తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు ముసాయిదా తక్షణమే తప్పులను సరి చేయాలి. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ.మల్లికార్జున్ గౌడ్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్ ( పరివర్తన ఆవాస్) మెదక్ పట్టణంలో 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు చేసి పొందుపర్చిన జాబితలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని వాటిని సవరించాలని బిఆర్ఎస్ పట్టణ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు,నాయకులతో కలిసి మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మున్సిపల్ కార్యాలయం ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితలో పూర్తిగా తప్పులు ఉన్నాయని అన్నారు. ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో రావడం…

Read More