Author: parivarthanaawaaz

మద్యం విక్రయాదారులపై కేసు నమోదు. పరివర్తన ఆవాజ్ పెనుబల్లి:  సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు పెనుబల్లి మండలం గంగదేవి పాడు లోని కిరణ షాపు యజమాని తేజావత్ బాలు అక్రమంగా ఎక్కువ ధరలకు మధ్య విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో వి యం ఎస్ఐ వెంకటేష్ కిరాణా దారుడు పై కేసు నమోదు చేశారు

Read More

ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను కాజేసిన రంగారెడ్డి జిల్లా ఏడీ! రంగారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 05 . రంగారెడ్డి జిల్లా లో ప్రభుత్వ భూముల పత్రాలతో అక్రమాలకు పాల్పడి, ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన ఓ ప్రభుత్వ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎట్టకేలకు వల పన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఏడీ శ్రీనివాసులు తన పదవిని దుర్వినియోగం చేస్తూ, తప్పుడు సర్వే నెంబర్లను సృష్టించడం ద్వారా విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అక్రమాల ద్వారానే…

Read More

బాడీబిల్డింగ్ లో సత్తా చాటిన రామాయంపేట యువత  రామయంపేట  పరివర్తన ఆవాజ్  డిసెంబర్ 5 :     ఐసీఎన్ షోలో పథకాల పంట పథకాలు సాధించిన వివేక్ వర్ధన్ సాయి వర్ధన్ డాక్టర్సతీష్ రామయంపేట ప్రతిష్టాత్మక ఐసీఎన్ (ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అండ్ న్యూట్రిషన్) అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ షోలో రామాయంపేట యువకులు సత్తా చాటారు. రామయంపేట పట్టణంలోని ‘ఫైట్ టు ఫిట్’ జిమ్ ట్రైనర్ బత్తిని శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బృందం, ఇటీవల గోవాలో జరిగిన ఐసిఎన్ పోటీలలో పాల్గొన్నారు. వివేక్ వర్ధన్ అద్భుత ప్రదర్శన కనబరిచి 3వ స్థానం దక్కించుకోగా, సాయి వర్ధన్ గట్టి పోటీ మధ్య 4వ స్థానంతో తన ప్రతిభను చాటారు. డా.సతీష్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.శిక్షణ, పట్టుదలతో ఈ స్థాయి విజయాన్ని సాధించిన యువకులను కోచ్ శ్రీకాంత్, రామాయంపేట ప్రజలు అభినందించారు.

Read More

క్రీడా పోటీల్లో విజేతలకు అభినందనలు తెలిపిన జిల్లాఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, రైసింగ్ డే వేడుకలలో భాగంగా రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్‌లు ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు హాజరై రమాయంపేట్ సర్కిల్ మరియు మెదక్ సర్కిల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత వాలీబాల్ ఫైనల్‌ను వీక్షించారు. ఈ పోటీలో మెదక్ సర్కిల్ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డి పోటీల్లో అల్లాదుర్గ్ సర్కిల్ మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ రెండవ స్థానం కైవసం చేసుకున్నాయి.మ్యూజికల్ చైర్ పోటీలో భూలి మొదటి స్థానం, లావణ్య ద్వితీయ స్థానం సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, రైసింగ్ డే సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో…

Read More

     సృజనాత్మకతను పెంపొందించేందుకె వైజ్ఞానిక ప్రదర్శనలు                            మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్   పరివర్తన ఆవాజ్04.   జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు గురువారం స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు సైన్స్ ఫెయిర్ కన్వీనర్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాద్యాయ సంఘాల నాయకులు, విద్యారిని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… ఎంచుకున్నటువంటి థీమ్,సబ్ థీమ్లు అభిరుచులకు తగ్గట్టుగా ఈ కాలానికి, మన దేశాని  అవసరమైనటువంటివిగా ఉన్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైన్స్ చదవడం కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ జ్ఞానాన్ని…

Read More

దివ్యాంగుల క్రీడోత్సవ విజేతలకు బహుమతుల ప్రదానం మెదక్ పరివర్తన అవాజ్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల భాగంగా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడోత్సవాలలో విజేతలైన క్రీడాకారులకు బుధవారం స్థానిక స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి డి ఆర్ డి ఏ APD సరస్వతి, డిపిఎం వెంకటేశ్వరరావు , మెప్మా పిడి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా APD సరస్వతి మాట్లాడుతూ, “పునరావాస కేంద్రంలో 283 మంది పేర్లు నమోదయ్యినా, ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రమం తప్పకుండా వస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న ఫిజియోథెరపీ వల్ల పలువురు పిల్లలు నడవగలుగుతున్నారు. నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నాం” అని తెలిపారు. దివ్యాంగులు పునరావాస కేంద్రాలను వినియోగించుకుని భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యం ఉన్నందున నిస్సహాయతకు లోనవ్వకుండా…

Read More

చల్లసముద్రం రాజకీయాల్లో కొత్త దిశ! BRS నేతలు కాంగ్రెస్‌లో చేరారు పరివర్తన అవాజ్ చల్లసముద్రం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,చల్లసముద్రం గ్రామపంచాయతీలో రాజకీయ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. స్థానిక రాజకీయ రంగంలో విశేష గుర్తింపు పొందిన బిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు ఎట్టి కోటయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ సభ్యురాలు మూతి వసంత ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ ప్రజలు, యువత, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ఇరు నాయకులు గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై కృషి చేస్తానని తెలిపారు.

Read More

నాలా ఆక్రమణపై నిమ్మకు నీరెత్తిన అధికారులు     శ్రీ చైతన్య కళాశాల బరితెగింపు వెనుక ‘మతలబు’ ఏమిటి? శేరిలింగంపల్లి, పరివర్తన అవాజ్ నవంబర్ 23 శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదినగూడ ప్రాంతంలో ఐదు ప్రధాన చెరువులను కలిపే అత్యంత కీలకమైన గొలుసుకట్టు నాలా ఆక్రమణ పెను సంచలనం సృష్టిస్తోంది. స్థానిక శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే, పట్టపగలు ఈ జీవనాలా రూపురేఖలు మార్చివేసి, దారి మళ్లించి, శాశ్వత బాక్స్ డ్రైన్‌ను నిర్మించినా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ మూడు శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారూ అంతే కాకుండా నాలా కబ్జాపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు నవంబర్ 14, 2025న తనిఖీ నిర్వహించి, శ్రీ చైతన్య యాజమాన్యం నాలాను ఆక్రమించి, మట్టి వ్యర్థాలతో పూడ్చివేసినట్లు ధృవీకరించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవంబర్ 15న తక్షణ చర్యల కోసం జీహెచ్‌ఎంసీ సర్కిల్ 21…

Read More

ఇల్లందు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ           మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు, నవంబర్ 23 (పరివర్తన అవాజ్):తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఇల్లందు తాహశీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో ధన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మహిళా సోదరీమణులకు ఉచిత చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారి (డిడిఓ) విద్యా చందన ని ఎమ్మెల్యే కనకయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. జిల్లా అభివృద్ధిలో ఆమె చూపిన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల…

Read More

   ఈనెల 24న జరుగు ధర్నాను జయప్రదం చేయాలి. సిఐటియు పరివర్తన ఆవాజ్. నవంబర్ 21 మహబూబాబాద్,  బయ్యారం. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ నెల 24న ధర్నాను జయప్రదం చేయాలి..,….. సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న. శుక్రవారం స్థానిక ఎంఆర్సి ఆఫీస్ నందు ఎం ఈ ఓ దేవేంద్ర చారి కి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. అనంతరం సంగిశెట్టి ఆదిశేషులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కన్వీనర్ వల్లాల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు చెల్లించడం లేదని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు. నూతన చట్టాలను పేరుతోటి నాలుగు లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని వారుఎద్దేవ చేశారు . కేంద్ర రాష్ట్ర…

Read More