Saturday, September 12, 2026
Home Politics బీఎస్పీ బి–ఫారం అందుకున్న కురిమెళ్ల శంకర్

బీఎస్పీ బి–ఫారం అందుకున్న కురిమెళ్ల శంకర్

0
51
IMG-20260131-WA05331

📰 Generate e-Paper Clip

 

25వ జనరల్ డివిజన్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలి: బీఎస్పీ నేతల పిలుపు

పరివర్తన అవాజ్, కొత్తగూడెం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా 25వ జనరల్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కురిమెళ్ల శంకర్‌కు పార్టీ అధికారిక బి–ఫారం అందజేశారు. బీఎస్పీ జోనల్ ఇంచార్జ్ కదిరే కృష్ణ చేతుల మీదుగా కురిమెళ్ల శంకర్ బి–ఫారం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ తాండ్ర వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పూలే తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో జరుగుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ జనరల్ డివిజన్ నుంచి కురిమెళ్ల శంకరయ్యను భారీ మెజార్టీతో గెలిపించి బీఎస్పీ బలాన్ని చాటాలని ప్రజలను కోరారు.
బహుజనుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీగా బీఎస్పీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని, కురిమెళ్ల శంకర్ విజయం ద్వారా కార్పొరేషన్‌లో బహుజన స్వరం మరింత బలపడుతుందని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.