Author: laxman RAO

  ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి సమన్యాయం చేయాలని డిమాండ్ పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల (TEAM) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “మాలల న్యాయ పోరాట సభ” విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సభకు శనగ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాలల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. దాసరి చెన్నకేశవులు, జేఎన్‌టీయూహెచ్ జేఏసీ చైర్మన్ డా. రంజిత్ కుమార్ మందా, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య డా. మద్దెల శివకుమార్, మాలమహానాడు సెక్రటరీ జనరల్ మధుసూదన్ (చిన్ని), మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, నవతన్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్లు పోలుమూరి ధనలక్ష్మి, నామా కీర్తి, గుర్రం వెంకటేశ్వర్లు, ఆకునూరి సుప్రియ, మద్దాల హరిత, కాల్వ భాస్కర్,…

Read More

కొత్తగూడెంలో కరపత్రం ఆవిష్కరణ – ఎస్సీ ఉపవర్గీకరణపై మాల సంఘాల ఐక్య స్వరం పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం ఎస్సీ ఉపవర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మాల సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మే 10న కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న “మాలల న్యాయపోరాట సభ”కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో 59 షెడ్యూల్ కులాలను కులాల ఆధారంగా వర్గీకరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా ఎంపిరికల్ డేటా సేకరించి ఎస్సీల ఉపవర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణలోని అన్ని మాల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి న్యాయపోరాటాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని…

Read More

  కొత్తగూడెం/పాల్వంచ, మే 3: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (యూ జి) ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఉదయం నుంచే కేంద్రాలకు చేరుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం తనిఖీలు పూర్తి చేసి హాళ్లలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ తనిఖీలు కఠినంగా నిర్వహించడంతో పరీక్షలు సవ్యంగా జరిగాయి. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులు కేంద్రాల నుండి బయటకు రాగా, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలంగా పిల్లల చదువులు, పరీక్షలపై ఉన్న ఒత్తిడి తగ్గిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు కూడా పరీక్ష పేపర్ సగటుగా ఉందని, కొంత భాగం కఠినంగా ఉన్నప్పటికీ మొత్తం మీద సమతుల్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరమని తెలిపారు. మొత్తం మీద ఈ…

Read More

    పాల్వంచ/కొత్తగూడెం, మే 3: దేశవ్యాప్తంగా నేడు జరుగుతున్న నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష పాల్వంచలోని టీజీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్ జూనియర్ కాలేజీ (గురుకుల పాఠశాల)లో పకడ్బందీగా జరిగింది. ఉదయం నుంచే పరీక్ష కేంద్రం వద్ద సందడి నెలకొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా ముందస్తుగా వచ్చి, పరీక్ష నిబంధనలను పాటిస్తూ తమ పిల్లలను సెంటర్‌లోకి పంపించారు. అధికారులు విద్యార్థుల తనిఖీలు కఠినంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో సాగినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా పాల్వంచ గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష సజావుగా, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడింది.

Read More

పరివర్తన్ అవాజ్ ,కొత్తగూడెం హైదరాబాద్‌లోని వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ (డబల్యూ ఈవో) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా దుర్గారాసి సతీష్‌ను డబల్యూ ఈవో నియమించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు సి.హెచ్. భద్రం నియామక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో భద్రం మాట్లాడుతూ, “పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే మనలను పర్యావరణం రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి” అని తెలిపారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.తదుపరి, దుర్గారాసి సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన భద్రం గారికి మరియు సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. “బాన్ ప్లాస్టిక్ – సేవ్ నేచర్” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటి, పర్యావరణ రక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని, ఒక రక్షకుడిగా పనిచేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొత్తగూడెం 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఖండించారు..పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా తప్పు అని ఆమె ఖండించారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడం అని పేర్కొన్నారు.అప్పటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఏర్పాటుచేసిందని తెలిపారు. అలాంటి నిర్ణయాన్ని తక్కువ చేసి మాట్లాడటం బీజేపీ నాయకుల అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు.తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన తేజస్వీ సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, యావత్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సుప్రియ డిమాండ్…

Read More

  సన్మానం చేసిన మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి పరివర్తన ఆవాజ్ ,కొత్తగూడెం చుంచుపల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో నాగరాజును స్థానిక ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి కలిసి నాగరాజుకు సాలువా కప్పి అభినందనలు తెలిపారు.మండల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని వారు కోరారు. ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో నాగరాజు మాట్లాడుతూ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో పారదర్శక పాలన అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో *ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను జిల్లాలో అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.సోలార్ విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు . అదనంగా, వినియోగించని విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తిరిగి ఆదాయం పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం…

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని నందా తండా గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ మాలోత్ బలరాం నాయకత్వంలో గ్రామంలో శుభ్రత మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త మరియు మురుగునీటి సమస్య గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. ఈ సమస్యలను గుర్తించిన సర్పంచ్ మాలోత్ బలరాం వెంటనే చర్యలు చేపట్టి, గ్రామంలోని ప్రధాన వీధులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం గ్రామంలో ప్రత్యేక బృందాల ద్వారా చెత్త తొలగింపు, మురుగు నీటి కాలువల శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా, దోమలు, వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుముఖం పట్టింది.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ మాలోత్ బలరాం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి…

Read More

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. చుంచుపల్లి బైపాస్ రోడ్డులో ఎంఎస్ పాన్ మహల్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త, యువ కాంగ్రెస్ నాయకుడు మరియు ఎంఎస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ మతిన్ ప్రజలకు సేమియాను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌హెచ్ రవి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని సేమియాను స్వీకరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

Read More