Author: parivarthanaawaaz

అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర  వీర కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు త్యాగాల వల్లే నేటి సమాజంలో శాంతి, భద్రత కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. పరివర్తన అవాజ్,   కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్  మరియు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. శాంతి, సౌభ్రాతృత్వం నేడు కనిపించడం అమరవీరుల త్యాగ ఫలమని జిల్లా కలెక్టర్  పేర్కొన్నారు. పోలీసులు ప్రజల రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో విధి నిర్వాహణలో…

Read More

  వీళ్ళు నిద్రపోరే… వీళ్ళు మన రక్షకులే – పోలీసు అమరవీరుల నివాళి       దినోత్సవం, పరివర్తన అవాజ్,   అంతర్యామిలా శాంతిని కాపాడే వారు… ప్రజల భద్రత కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే వారు… వాళ్ళే మన పోలీసులు. అందరూ నిద్రపోతే… వీళ్లు మేల్కొని ఉంటారు. అందరూ పండగలు జరుపుకుంటే… వీళ్లు కర్తవ్యాన్ని జరుపుకుంటారు. మనమందరం శాంతిగా జీవించేందుకు, సురక్షితంగా నడిచేందుకు వీళ్ళు జీవితం అంకితం చేశారు. ఈరోజు అక్టోబర్ 21 – పోలీసు అమరవీరుల దినోత్సవం. ఈ సందర్భంగా, తమ ప్రాణాలను దేశ ప్రజల కోసం త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. వీరుల త్యాగం వల్లే ఈ రోజు మనం ఇలాగే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. వారిని స్మరించుకోవడం, గౌరవించడం — మన బాధ్యత, మన ఋణం. ఈ సందర్భంగా… మనమందరం ఒక్కసారి మన హృదయాన్ని వాల్చి, పోలీస్ అమరవీరుల సాహసానికి,…

Read More

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్, పరివర్తన అవాజ్,    కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్ ను హతమార్చిన రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను పోలీస్ కానిస్టేబుల్ గన్ గుంజుకుని ఆసుపత్రి నుండి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ రోజే కానిస్టేబుల్ అంతక్రియలు జరిగాయి. పోలీసులు యూనిఫామ్ వేసుకొని అతని పాడే మోశారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది.

Read More

              జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పరివర్తన అవాజ్ జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసోమవారం జహీరాబాద్ పట్టణంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో శివప్ప (52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

           కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్ పరివర్తన అవాజ్   తెలంగాణ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించి పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాగా నిజామాబాద్‌లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ వస్తే.. కత్తితో దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశాడు.

Read More

             పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులు, పరివర్తన అవాజ్,      పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులుతెలంగాణ : వరంగల్‌ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే దోనెపూడి, గూడూరు హరిబాబు, సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్‌ఫోన్లు, పేకాట కార్డులు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు

Read More

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య పరివర్తన అవాజ్ , దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యతెలంగాణ : కన్నబిడ్డలను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులను బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), అవంతిక (9), భవన్ సాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

                    నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం! పరివర్తన అవాజ్ నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం! లక్సెట్టిపేట మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్, ఈనెల 18న సాయంత్రం తన ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 2528కు పెంచేందుకు కృషి చేశాడు. బిల్లులు రాకపోవడంతో రూ. లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసినట్లు, దీనిపై మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి వివరాలు సేకరిస్తామని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.

Read More

     భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త పరివర్తన అవాజ్, భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త తెలంగాణ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌పై ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ ఘటన జరిగింది. మందమర్రి ప్రాంతానికి చెందిన రజిత అనే మహిళను ఆమె భర్త కుమార్‌ స్వామి వంతెనపై నుంచి తోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రజిత మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన భర్త కోపంతో ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Read More

                 చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత పరివర్తన అవాజ్   చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.

Read More