Author: parivarthanaawaaz

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 21 ,   తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని అన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising…

Read More

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం.పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం: జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో (పరివర్తన అవాజ్  అక్టోబర్, 21) హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ ని ఆహ్వానించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ శాంతి భద్రతల…

Read More

సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు, శేరీలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 21,  మియాపూర్ పోలీస్ నిఘా బృందం సెల్ ఫోన్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దోపిడి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అరెస్టయిన నిందితుల వివరాల శాలిబండకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అయాజ్ వృత్తి: ఆటో డ్రైవర్, కాలపత్తర్ కు చెందిన రెండవ నిందితుడు మీర్జా ఫరూక్ బైగ్,వృత్తి: పండ్ల వ్యాపారి, బహుదూర్ పురకు చెందీన మూడవ నిందితుడు సయ్యద్ సాజిద్,వృత్తి: ఆటో డ్రైవర్, పహాడీషరీఫ్ కు చెందిన నాలుగవ నిందితుడు మొహద్ అమీర్, వృత్తి: ఆటో డ్రైవర్,తలాబ్ కట్టకు చెందిన అయిదవ నిందితుడు సయ్యద్ ఒమర్,వృత్తి పుస్తకాల వ్యాపారి, ఫలక్ నుమా కు చెందిన ఆరవ నిందితుడు అబ్దుల్ నవీద్, వృత్తి: ఫోన్ల వ్యాపారం…

Read More

బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన, రైతుల కోసం కొత్త విద్యుత్ లైన్‌కు శ్రీకారం,అంగన్‌వాడీ, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన పరివర్తన అవాజ్ న్యూస్ బయ్యారం /పబ్బు శివ: ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు మంగళవారం బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నూతన విద్యుత్ లైన్ ప్రారంభం:నామాలపాడు గ్రామ పంచాయతీ ధర్మాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్థం 33/11 కెవి నూతన విద్యుత్ లైన్ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు శ్రీకారం చుట్టారు. ఈ లైన్‌ను సుమారు రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన:మండలంలోని కొత్తపేట, గంధంపల్లి, బాలాజిపేట గ్రామాలలో ఎమ్మెన్నార్ఈజీఎస్ పథకం క్రింద మంజూరైన నూతన అంగన్‌వాడీ భవనాలకు, అలాగే గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఎమ్మెల్యే…

Read More

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పై రేగోడులో సమీక్షా సమావేశం – కలెక్టర్ పర్యవేక్షణ”  మెదక్  జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)   మంగళవారం రేగోడు మండలం రైతు వేదికలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ అమలుపై మెదక్ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ,జిల్లా వ్యవసాయ అధికారి ‌ రైతులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుత  దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారాఅధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చు అని తెలిపారు.దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు.జాతీయ నూనె గింజల”…

Read More

   లింగంపల్లి భస్తి దవాఖానను సందర్శించిన హరీశ్ రావ్ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్  అక్టోబర్ 21, మాజీ మంత్రి హరీశ్ రావ్ మంగళవారం నాడు లింగంపల్లి గ్రామంలో భస్తి దవాఖానను సందర్శించారు దవాఖాన నిర్వహిస్తున్న తీరు ప్రజలకు చేస్తున్న వైద్యం వివరాలను పరిశీలించారు అయితే భస్తి దవాఖాన నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుందని అవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావ్ మాట్లాడుతూ బస్తి దవాఖానాల్లో ప్రజలకు సుస్తీ చేస్తే చికిత్స చేయాల్సిన దవాఖానల్లో మందులు,టెస్టులు అందుబాటులో లేవని దవాఖాన సిబ్బందికి కూడా సరిగ్గా జీతాలే అందడం లేదని తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానలకే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సుస్తీ చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సౌలభ్యం కోసం కేసీఆర్ ఈ బస్తీ దవాఖానాలను ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసి 110 రకాల మందులను 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన రవికి నివాళి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు” సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం… -ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.. *అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)  సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి కేఆర్ నాగరాజు స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన…

Read More

ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి,   పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం లో స్మృతి   పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి   అర్పించిన…జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపియస్. *   పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 21 మహబూబాబాద్,    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరం లో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను…

Read More

పోలీసు స్మృతి దినోత్సవం ఘనంగా నిర్వహణ – ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పాల్గొనడం, పోలీస్ స్మృతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం.. -పోలీస్ అమరవీరులకు స్థూపానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు … -అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యేలు, సిపి, కలెక్టర్లు, కమిషనర్.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)  హన్మకొండ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం పోలీస్ స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, వరంగల్ నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్,…

Read More

పూలే విగ్రహ ధ్వంసం పై బీసీల ఘాటు హెచ్చరిక – నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి” మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి… బీసీల ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చాలా బాధాకరం.. విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు.. బీసీలపై ప్రేమ అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో సమాధానం చెప్పి తీరాలి… వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) వరంగల్ నగరంలో ఉర్సు దర్గా ప్రాంతంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనకు బాధ్యులన్నీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కఠినంగా…

Read More