పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ఆగస్టు 23: కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 26 తేదీన జరగనున్నటువంటి మిలాద్ ఉల్ నబి పండుగను పురస్కరించుకొని ముస్లిం మత పెద్దలతో కామారెడ్డి పోలీస్ స్టేషన్ యందు కామారెడ్డి డి.ఎస్.పి గారి ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ ప్రాఫిట్ మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా మిలాద్ ఉల్ నబీ పండుగను ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్య పూర్వకంగా నిర్వహిస్తారని అదేవిధంగా కామారెడ్డి పట్టణం ఎందుకు కూడా ముస్లిం మత పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పండుగను శాంతి యుతంగా నిర్వహించాలని ముస్లిం మత పెద్దలకు కోరడం జరిగినది.




