Sunday, September 13, 2026
Home Politics ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య

0
41

📰 Generate e-Paper Clip

 ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య

                                           ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ

(పరివర్తన అవాజ్)  తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యం తోనే ప్రభుత్వ పాఠశాల లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
​ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని డిమాండ్ చేశారు.
​ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అరకొర వసతులతో, ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే నడవడం దురదృష్టకరమని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని పేర్కొన్నారు.
​ ఉపాధ్యాయులను బోధనకు దూరంగా ఉంచి, విద్యా సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.​ ప్రభుత్వ పాఠశాలల మనుగడ కేవలం ఉపాధ్యాయుల వల్లనే కాకుండా,తల్లిదండ్రులు ,ప్రజల చైతన్యం, నిరంత ర పర్యవేక్షణ ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు అనంతరం అనంతరం.​అనంతరం ఈ సమావేశంలో కమిటీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై.అశోక్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి కె. రవి చందర్, టీపిటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి.కొండల్ రెడ్డి లు మాట్లాడుతూ.. విద్యా రంగంలో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అశాస్త్రీయ ధోరణులను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యా విధానాల కోసం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డా. పిడి ఆనందం, జె. రాంచంద్రం, బి. ముత్యాలు, విద్యాసాగర్, రాజేందర్, హీరాలాల్, రెసిడెన్సియల్ టీచర్స్, పిడిఎస్ యూ విద్యార్థులు, టీపిటీఎఫ్ జిల్లాకమిటి సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.