9 అక్టోబర్ (ఆవాజ్ న్యూస్) ఈరోజు గురువారం బండ్ల అంగడిని అధికారులు సందర్శించి అక్కడ ఉన్న ప్రతి వాహనానికి సంబంధించిన ఆర్సీ మరియు ఓనర్షిప్ పత్రాలను సక్రమంగా పరిశీలించారు. అనంతరం కొనుగోలుదారులకు అవగాహన కల్పిస్తూ వాహనం కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఆ వాహనం ఆర్సీ, ఇన్సూరెన్స్ మరియు యజమాని వివరాలు పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు. నకిలీ లేదా వివాదాస్పద వాహనాల లావాదేవీలకు దూరంగా ఉండి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కొనుగోలుదారులను హెచ్చరించారు.




