Saturday, September 12, 2026
Home People ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

0
27

📰 Generate e-Paper Clip

  పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా  : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి సోమవారం
65 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 65 ఫిర్యాదులు అందాయి.ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపించి నిబంధనల ప్రకారం పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు.ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హత ఉన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, భూ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, సీఈఓ చందర్, డిఆర్ఓ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.