Sunday, September 20, 2026
Home People వినాయక మండపాలను సందర్శించిన    పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని...

వినాయక మండపాలను సందర్శించిన    పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి ..

0
20

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్   తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 20

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పరిధిలనం, 29వ డివిజన్,51 వ డివిజన్, 6వ డివిజన్ పరిధిలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సందర్శించారు.ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. నిర్వాహకులు నాయిని నీలిమ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

ఈ వేడుకల్లో వారి వెంట ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,మహిళలు భక్తులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.