Author: Sai Krishna
ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/పరివర్తన అవాజ్ , నవంబర్ 17, ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి. యాకుబ్ పాషా గతం నెలలో ఒక రేషన్ షాపు తనిఖీ చేసి స్టాక్ తక్కువగా ఉందని కేసు నమోదు చేశారు. షాపును సీజ్ చేశారు. రూ.30 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. విజయ్ అనే అసిస్టెంట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షులు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్, యాకుబ్ పాషా, విజయ్,శబరిష్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా ఏ సీ బి అరెస్టు చేసింది.
వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు. టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్: భారత స్వాతంత్రోద్యమంలో సమరయోధుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ZPSS పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ రామచంద్ర సింగ్ సార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ అధ్యక్షతన జరిగింది,జిల్లా సీనియర్ నాయకులు దారావత్ ద్రావషింగ్ పాల్గొన్నారు,టేకులపల్లి మండల కన్వీనర్ రవి రాథోడ్ మాట్లాడుతూ దేశం పట్ల విద్యార్థులు దేశభక్తిని చాటాలని, నిరంతరం సమాజం పట్ల, ఉపాధ్యాయుల పట్ల దేశభక్తితో ఉండాలని చెప్పారు, బ్రిటిషర్ల కాలంలో వందేమాతరం అంటే…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే ముఖాముఖి… పరివర్తన అవాజ్ న్యూస్ నవంబర్ 03 , వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశంలో నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ రాంబాబు కొండపల్లి సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి శివయ్య పత్తె మధు డివిజన్ పరిధిలో గల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.