మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి
పరివర్తన అవాజ్,కొత్తగూడెంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ పొత్తుతో మేయర్ పదవి సిపిఐ కైవసం చెసుకుంటుందని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి అన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమతుల్యత కోసం డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవసరమని సూరి పేర్కొన్నారు.
