పరివర్తన అవాజ్,కొత్తగూడెం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం స్టేడియంలో ఘనంగా ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ ముగ్గుల పోటీల ప్రారంభ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులతో స్టేడియాన్ని కళకళలాడించారు.
