ఆలయ నిర్మాణం.. అభినందనీయం
తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్
పరివర్తన ఆవాజ్ జనవరి7 మహబూబాబాద్ ప్రతినిధి పగడాల రామారావు.నర్సింహులపేట. .ఆలయ నిర్మాణం అభినందనీయమని నర్సింహులపేట తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ సురేష్ అన్నారు.నర్సింహులపేట గ్రామ శివారులో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు చలిమల్ల యాదగిరి ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా కాంక్రీటు పనులను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్ మాట్లాడుతూ..గౌడ సంఘం అధ్యక్షునిగా ఉంటూ తన సొంత ఖర్చులతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,ఉప సర్పంచ్ కాస యాకయ్య,వార్డు సభ్యులు కొంపల్లి యాకయ్య,గౌడ సంఘం నాయకులు గండి సురేష్,గంధసిరి రమేష్,గుండగాని వెంకన్న,దుబాకుల వెంకన్న,దోమల యాదగిరి,గుర్రం వెంకన్న,బిఆర్ఎస్ నాయకులు కొండబత్తిని జగదీశ్వర్,నకరకంటి శివప్రసాద్,మద్ది శేఖర్,కల్లెడ రమేష్ తదితరులు ఉన్నారు.

