అవాజ్ చల్లసముద్రం: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి తాటి బిక్షం దూసుకుపోతున్నారు. ఆయనకు కేటాయించిన ‘ఉంగరం’ గుర్తు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిక్షం గారు ‘గడప గడపకు’ ప్రచారంతో ఇంటింటికీ తిరుగుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.”నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. ఉంగరం ‘విశ్వాసానికి’ చిహ్నం. మీ ఆశీర్వాదంతో గ్రామ ప్రజలకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను,” అని తాటి బిక్షం గారు ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఆయన ప్రచారానికి కాంగ్రెస్ శ్రేణులు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాటి బిక్షం గారి విజయం ఖాయమని స్థానిక పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉంగరం గుర్తుతో గెలుపు బాటలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి బిక్షం
Previous Articleఅగ్రహారం గ్రామ సర్పంచి గా మోడే కాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2026 Parivarthana Awaaz . Designed by Creativals.com.
