టేకులపల్లి గ్రామపంచాయతీ లో కొమరం భీమ్ జయంతి వేడుకలు.
టేకులపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 22, బుధవారం మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్.ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు, ముందుగా టేకులపల్లి సెంటర్ లో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గిరిజనుల అభివృద్ధి కొరకు కొమరం భీమ్ చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ.బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు,బర్మావత్ శివకృష్ణ, లచ్చు నాయక్,చీమల రామకృష్ణ, మాజీ సర్పంచుల సంఘ అధ్యక్షుడు రాజేందర్, కరుణాకర్, మాజీ సర్పంచి లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ మండల మహిళఅధ్యక్షురాలు ఆమడ రేణుక, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

