టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం
సరైనా నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఆందోల్
శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ హోల్ సెల్ టపాకాయల గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మరో రెండు రోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల,హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి అనేకమంది ఆందోల్ లోని కటకం వేణుగోపాల్ &సన్స్ టపకాయల గోదాం వద్దకు రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది.సాయంత్రం ఒక్కసారిగా గోదాం పక్కనే ఉన్న షాపు వద్ద మంటలు చెలరేగడం,టపకాయలు పెద్ద ఎత్తున ఉండటంతో క్షణాల్లో మంటలు పూర్తిగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.వెంటనే అంగీ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.హోల్ సెల్ టపాకాయల గోదాం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతో ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలోవిక్రయదారులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం తప్పింది.ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేమైన కారణమా అనే అంశంపై పరిశీలిస్తున్న పోలీసులు,

