బిఆర్ఎస్ మోసాల పార్ట మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13, బిఆర్ఎస్ మోసాల పార్టీ అని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ సోమవారం తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో 2014 నుండి 2023 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిందని బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చిన మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ మొదటి మోసం దళిత సీఎం రెండవ మోసం డబల్ బెడ్ రూమ్ లు ఇల్లు ఇస్తామని చెప్పి ఐదు లక్షల 70 వేల ఇండ్లకు కేవలం 63000ఇండ్లు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు, రాష్ట్రం ఏర్పడగానే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారే అలంకరించి దళితులందరికీ మోసం చేశారని ఆయన విమర్శించారు, దళిత బంధు 38వేల మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు చెప్పి ఇచ్చింది సున్నా మాత్రమే అని, ఇంటికో ఉద్యోగం అని, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీల రిజర్వేషన్ 12 శాతం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంటులో ఉందని మైనార్టీలను మోసం చేసి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదె అని ఎద్దేవా చేశారు

