Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 4:11 am Posted by : Bommala Kumar

ప్రభుత్వాలు మారుతున్నాయి… కానీ మా విలేజ్ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు!

oplus_136380432

సందిబంధం గ్రామం, నడిమిగూడెం పంచాయతీ, అలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ప్రభుత్వాలు మారాయి… పాలకులు మారారు… సంవత్సరాలు గడిచాయి. కానీ సందిబంధం గ్రామ ప్రజల రోడ్డు సమస్య మాత్రం అలాగే ఉంది.వర్షం పడితే రోడ్డు మొత్తం బురదమయంగా మారుతోంది. గుంతల్లో నీరు నిలవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు నడవడానికి కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.“ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి… మా గ్రామ రోడ్డు ఎప్పుడు బాగుపడుతుంది?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి, సందిబంధం గ్రామ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.