Date of Publish : 16 April 2026, 3:40 pmPosted by : laxman RAO
భద్రాద్రి జిల్లా (డబల్యూ ఈవో) కార్యదర్శిగా దుర్గారాసి సతీష్ నియామకం
పరివర్తన్ అవాజ్ ,కొత్తగూడెం హైదరాబాద్లోని వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ (డబల్యూ ఈవో) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా దుర్గారాసి సతీష్ను డబల్యూ ఈవో నియమించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు సి.హెచ్. భద్రం నియామక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో భద్రం మాట్లాడుతూ, “పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే మనలను పర్యావరణం రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి” అని తెలిపారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.తదుపరి, దుర్గారాసి సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన భద్రం గారికి మరియు సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. “బాన్ ప్లాస్టిక్ – సేవ్ నేచర్” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటి, పర్యావరణ రక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని, ఒక రక్షకుడిగా పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు.