Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 5:13 am Posted by : laxman RAO

రామవరం 14వ డివిజన్‌లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ఉద్ధృతం

చేయి గుర్తుపై ఓటు వేసి విశ్వనాధ్‌ను గెలిపించాలని పిలుపు

పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం టౌన్:రామవరం 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు — తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాలను పరిష్కరించాలంటే ప్రజలతో నిత్యం మమేకమై ఉండే నాయకుడు అవసరమని పేర్కొన్నారు.
అలాంటి నాయకుడిగా విశ్వనాధ్ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడే వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. రామవరం 14వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా విశ్వనాధ్‌కే ఉందని స్పష్టం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవినీతి, నిర్లక్ష్య రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
అందుకే రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాధ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని రామవరం 14వ డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.