Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 12:48 pm Posted by : laxman RAO

విద్యానగర్ కాలనీ పంచాయితీ 6వ వార్డులో సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

విద్యానగర్ కాలనీ పంచాయితీ పరిధిలోని 6వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూమి చదును చేసే కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి పంచాయితీ పాలకవర్గం ప్రత్యేక చొరవ చూపింది.

ఈ కార్యక్రమంలో సర్పంచి భూక్య శాంతి , ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి , అలాగే 6వ వార్డు మెంబర్ వాడపల్లి జకరయ్య స్వయంగా హాజరై పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వార్డు ప్రజలకు రాకపోకల సమస్యలు తొలగి, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయని నాయకులు తెలిపారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పంచాయితీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి వార్డులో అవసరమైన పనులను దశలవారీగా చేపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించి పంచాయితీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.