Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 2:48 am Posted by : parivarthanaawaaz

కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి

          కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి

                     నోముల భానుచందర్.

టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 17  టేకులపల్లి :కోతలు, కుక్కల వాళ్ళ టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోతలు, కుక్కల వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు అని వాటి వాళ్ళ మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు గాయాల పాలవుతున్నారని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ కి పాలక వర్గాలు లేక నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉండడం జరిగిందని ప్రస్తుతం గ్రామ పంచాయతీ కి ఎన్నికలు నిర్వహించడం నూతనంగా ఎన్నికైన పాలక వర్గం, సర్పంచ్ ప్రజల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గ్రామ పంచాయతీ లో ఉన్న కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని అదే విధం గా వీధి దీపాలు, బ్లీచీంగ్, ఫాగింగ్ చేయలని గుంతలమయంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వెంటనే పనులను గుర్తించి నిధులు కేటాయించి తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.