Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 2:05 pm Posted by : parivarthanaawaaz

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మృత్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మృత్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి

పరివర్తన అవాజ్– కారేపల్లి, డిసెంబర్ 6: మండలంలోని బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీరా బావుసింగ్- సువాలి కుమారుడు అజ్మీరా విజయ్ కుమార్ విద్యుత్ ఘాతంలో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ హనుమంతరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు శనివారం మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా హనుమంత రావు మాట్లాడుతూ… విజయ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మృత్యువు కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హాట్కార్ రాంబాబు నాయక్, అజ్మీరా హేమ్లా నాయక్, అజ్మీరా నారాయణ, అజ్మీరా రవి, మాలోత్ బాలు, అజ్మీరా శంకర్ అజ్మీరా దేవా, జర్పలా రామారావు, అజ్మీర చిట్టిబాబు, అజ్మీరా రామారావు, బానోత్ బాబు,అజ్మీరా తిరుపతి, అజ్మీరా సురేష్ తదితరులు పాల్గొన్నారు