Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 3:59 pm Posted by : parivarthanaawaaz

ఆర్టిజన్ కుటుంబానికి కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ ఆర్థిక సాయం

       ఆర్టిజన్ కుటుంబానికి కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ ఆర్థిక సాయం

కామారెడ్డి పరివర్తన అవాజ్  డిసెంబర్ 08:    కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన, ఎంబరి గౌరయ్య,  అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుమారుడు ఏంబరి రామచంద్రం, విద్యుత్తు ఆర్టిజన్గా ఇసాయిపేటలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఇట్టి అకాల మరణాన్ని, కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ తీవ్ర సానుభూతిని వ్యక్తపరిచింది, తమ జాక్ కుటుంబానికి, సానుభూతిపరంగా ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ నాయకులు, ఎం. నాంపల్లి, యు. బాల్ నర్స్. ఉప్పు స్వామి, ఎస్ రాజు, వై. పోచయ్య. తదితరులు పాల్గొన్నారు.