Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 10:50 am Posted by : parivarthanaawaaz

వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది

వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది

మెదక్ జిల్లా కొల్చారం వైపు నుండి ఏడుపాయల కు
దారి మొదటి బ్రిడ్జి దాట గానే ఒక మహిళపై దారుణం చోటుకు చేసుకుంది. మహిళపై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళా చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు.తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం పోలీసులకు ఇవ్వడంతో మెదక్
మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. బాధిత మహిళనుమెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం
బాధిత మహిళది
మెదక్ మండలం చిట్యాల తండాకు చెందిన మహిళల
తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసిందని
డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు