Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 9:14 am Posted by : parivarthanaawaaz

మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ రాజ్ కుమార్…

మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ రాజ్ కుమార్.

అక్టోబర్ 9 (పరివర్తన అవాజ్ న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ యువత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాటి గూడెం గ్రామ పెద్దమనుషుల యువత సమక్షంలో అందజేయడం జరిగింది.