Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 12:44 pm Posted by : parivarthanaawaaz

జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం

  తెలంగాణ పరివర్తన అవాజ్ న్యూస్:     నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవెలప్మెంట్ రాజేంద్రనగర్ లో 2 రోజు ల జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం విభవాని ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభవాని ఇండియా, శ్రీ. ప్రదీప్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఉన్నతి భారతి అభియాన్, డాక్టర్ రమేష్ డైరెక్టర్ ఎన్ ఐ ఆర్ డి ఇన్స్టిట్యూట్ మరియు హరిప్రసాద్ స్టేట్ కోఆర్డినేటర్ విభవాని ఇండియా. ఈ శిక్షణ లో భాగంగా నీటిని ఏ విధంగా ఒడిసి పట్టాలి, ప్రజల బాధ్యత, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల బాధ్యత అనే అంశాలు చర్చించి తీసుకోవాల్సిన చర్యలు జాగర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల నుండి స్వచ్ఛంద సంస్థలు, విద్య సంస్థలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు నుండి 60 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.