సైబర్ నేరగాళ్లవలలో పడకండి సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13 , సమాజంలో సమాచారాన్ని అత్యధిక వేగంగా వ్యాప్తి చెందించే సమాచార వేదిక వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేగంగా సమాచారాన్ని దేశ దేశాలుగా వ్యాపింప చేస్తూ ఉంటుంది. దీనినే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు సులువుగా కష్టపడకుండా ఎక్కువ ధనార్జన సంపాదించాలి అన్న ఆశతో విభిన్న రకాలైనటువంటి లింకులను ఈ సోషల్ మీడియా ద్వారా మొబైల్ కు మొబైల్ కు పంపుతూ మీకు లాటరీ తగిలిందని డబ్బులు వచ్చాయని మీ బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకోమని పంపుతున్నారు వాటికి ఆశపడి అలాంటి లింకులు ఓపెన్ చేస్తే మీరు మోసపోయినట్టే అని హవేలీ ఘన్పూర్ మండలం ముత్తయి కోట మద్దులయి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జరుగుతున్న ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ అన్నారు ఈ మధ్యకాలంలో అధికంగా యువత వ్యాసాలకు అలవాటు పడి లోనియా పేరుతో వచ్చే ఏపీకె ఫైల్స్ ను ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా లోను తీసుకుని క్రమంలో తమ ఫోటోలు ఆధార కార్డులను అప్లోడ్ చేయడం వలన సైబర్ నెరజానలు ఫోటోలు మార్చండి బెదిరించడం బ్యాంక్ అకౌంట్ ద్వారా ఓటిపి అడిగి డబ్బులను డ్రా చేయడం జరుగుతుందన్నారు ఎవరి ఫోన్ లేట్ అయిన ఏపీకే ఫైల్స్ వచ్చినట్టయితే వెంటనే డిలీట్ చేయాలి అన్నారు ఎక్కువగా సైబర్ క్రైమ్ ఫ్లిప్ కార్డ్ అమెజాన్ మీ షో. ఫేక్ యాప్ ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ వాళ్లకి 1936 ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని అందించినట్లయితే పోగొట్టుకున్నటు వంటి డబ్బును తిరిగి పొందవచ్చు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ రఘు బాబు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు

