విద్యార్థుల హక్కుల పరిరక్షనే ప్రధాన లక్ష్యం ..జాతీయ మానవ హక్కుల కమిషన్ .. శివ శంకర్
దుబ్బాక ( పరివర్తన అవాజ్ ): దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో జాతీయ మానవ హక్కుల సంస్థ దుబ్బాక మండల అధ్యక్షులు పున్న శివశంకర్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల మరియు యుపిఎస్ ప్రాథమిక పాఠశాల లో ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. విధ్యార్తులకు మధ్యాహ్న భోజనం పథకంలోనీ ఆహారాలు తనిఖీ చేయడం జరిగింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మెనూ ఆధారంగా భోజనాన్ని అందించాలని సూచించడం జరిగింది. విద్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలపడం జరిగింది. విద్యార్థుల ప్రాథమిక హక్కులను వారికి చెప్పడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా వారికి సహాయం అందుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి తనిఖీ కార్యక్రమానికి
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సహకరించడం జరిగింది .



