మానవత్వం చాటిన పోలీస్ కానిస్టేబుల్ సంజీవ్ రావు
జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్
కామారెడ్డి పరివర్తన అవాజ్ కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత అనే మహిళా కు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నీ సంప్రదించడంతో ఒక్క ఫోన్ చేయగానే స్పందించిన కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముకుందు గారి సంజీవరావు గారి సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరం ఉంది అనీ మెసేజ్ గాని ఫోన్ గాని రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు రక్తదానంకు ముందుండాలని కోరారు మరియు రక్తదాత కానిస్టేబుల్ సంజీవరావు గారికి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు

