బస్సును ఢీకొని యువకుడు మృతి
కామారెడ్డి పరివర్తన అవాజ్ ఇల్లందు నవంబర్ 17: కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు కామారెడ్డి నుండి పిట్లం వైపు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో ఓ ప్రయాణికుడిని దింపేందుకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా బస్సు ఆగింది. ఈ సందర్భంగా వెనుక నుండి వస్తున్న ఫిర్యాదుదారుని తమ్ముడు మాదిగ కాశీరాం (32 సంవత్సరాలు), మంబాజీపేట గ్రామం, లింగంపేట మండలం చెందినవ్యక్తి తన మోటార్సైకిల్తో బస్సును ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై మృతుని అన్న కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.

