పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ రూరల్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 23: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో దంతేల బోర ,జగన్నాధ పురం, కేశవా పురం, బసవ తారక కాలనీ, సూరారం గ్రామాల లో రెండు కోట్ల 30 లక్షల అంచనా కలిగిన సిసి రోడ్ల కు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివ రావు మీడియా తో మాట్లాడుతూ పాల్వంచ మండలంలో.ప్రజలు 24 వేలకు పైగా మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించుటకు కృషిచేసిన అందరికీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం, కేంద్రం మరియు ఇంకా అనేక రకాల నిధులు తెచ్చి కొత్తగూడెం నియోజకవర్గం లో ప్రతి గ్రామానికి, పట్టణంలో ప్రతి వీధి, ప్రతి గల్లీకి. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య, తదితర సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాని.
రోడ్లు లేని గ్రామం, పట్టణం, వీధి అంటూ లేకుండా చేస్తానని.ప్రభుత్వ సహకారం తో నిధులు రాబట్టి గ్రామా ల్లో, పట్టణ వీధు ల్లో అభివృద్ధి కార్యక్ర మాలు చేపడుతున్నామని. దీనికి అన్ని వర్గాల వారు మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్య క్రమం లో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం పాల్వంచమండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు,
నాయకులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, వైఎస్ గిరి, లాల్ పాషా, చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుకాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండం వెంకన్న మహేష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొ
న్నారు.


