పలు కాలనీలు సైకిల్ పై సందర్శించిన టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి
పరివర్తన ఆవాజ్ నవంబర్ 8 మహబూబాబాద్, స్థానిక పట్టణ కేంద్రంలో ఉదయం 5 గంటల నుండి నందమూరి నగర్, తీగల సత్యనారాయణ కాలనీ, జగన్ కాలనీ, సిగ్నల్ కాలనీ, ధర్మన్న కాలనీ, స్థానిక సీఐ ఉదయం నుండి ప్రజలతో మమేకమై కాలనీలో ఉండే సమస్య లను ఆరా తీస్తూ సైబర్, వెహికల్ దొంగలు ఉదయం పూట మహిళలు ఊడ్చే సమయంలో, మెడలో పుస్తెలతాడులు తెంపుకొని వెళుతున్నారు, కాబట్టి మహిళలకు తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తూ, కొన్ని చోట్లలో నందమూరి నగర్, ధర్మన్న కాలనీలో, కాలనీవాసులతో మాట్లాడి త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రజల సహకారం ఉంటే తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిఐ అన్నారు.

