నూతన ఖాతాదారుల సేవా కేంద్రం ప్రారంభం…
పరివర్తన అవాస్ న్యూస్ గార్ల: గార్ల శుక్రవారం రోజు పేపాయింట్ బిజినెస్ కరస్పాండెంట్ ఆధ్వర్యంలో నూతనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సేవ కేంద్రం బ్రాంచ్ మేనేజర్ భవాని శంకర్ పేపాయింట్ మేనేజర్ పూనెం మనోజ్. చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఖాతాదారుల సేవ కేంద్రం ప్రారంభించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ కస్టమర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఖాతాదారులు 30 వేల వరకు జమ చేసుకోవచ్చు ఉపసంహరణ చేసుకోవచ్చని మహిళా సంఘాల లోను సంబంధించిన లావాదేవీలు జరుపుకోవచ్చునని అలాగే పే పాయింట్ మేనేజర్ పూనెం. మనోజ్ మాట్లాడుతూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పథకాలు గురించి ఖాతాదారులకు వివరించి. అలాగే ఈ యొక్క ప్రమాద బీమా ప్రతి ఒక్క ఖాతాదారు తీసుకోవాలని ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది అలాగే గ్రామ పెద్దలు, మహిళా సంఘాల
పెద్దలు పాల్గొన్నారు.



