నవభారత్ విశ్రాంత ఉద్యోగి వీరభద్రయ్య మృతి పట్ల సంతాపం తెలిపిన -రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
పరివర్తన ఆవాజ్ నవంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పా త పాల్వంచ నివాసి నవభారత్ విశ్రాంత కార్మికుడు పట్నంశెట్టి వీరభద్రయ్య శుక్రవారం నాడు అనారోగ్యంతో మరణించారు.పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలోని భౌతిక కాయానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు.ఆయన కుమారుడు పట్నంశెట్టి సాంబశివరావు తో పాటు కుటుంబ సభ్యులు,బంధువులను పరామర్శించి సంతాపం సానుభూతి తెలిపారు.

